Search

YSR a Legend

Saturday, September 5, 2009

His political fever

రాజకీయ అరంగ్రేటం...


ఎమ్‌.ఆర్‌. మెడికల్‌ కాలేజీలో చదువుతున్నప్పుడే కాలేజీ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఉన్నప్పుడే రాజీకయాలవైపు అడుగులువేశారు రాజశేఖర రెడ్డి. కాలేజ్‌ ‘హౌజ్‌ సర్జన్‌ అసోసియేషన్‌’ అధ్యక్షుడిగా కాలేజీ తరుపున అనేక ఉద్యమాలలో చురుకుగా పాలుపంచుకునేవారు. 1971లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్న రాజశేఖర రెడ్డికి ఒక కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి, కుమార్తె షర్మి సంతానం. కొన్నాళ్ళకు వైద్య వృత్తి స్వస్తి చెప్పిన రాజశేఖర రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. గ్రామస్థాయినుండి అంచెలంచెలుగా ఎదుగుతూ... 1975లో కడప యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రాజశేఖర రెడ్డి ఇక అప్పటినుండి వెనుదిరిగి చూసుకోలేదు. 
1978లో పులివెందుల నియోజక వర్గం నుండి కాంగ్రెస్‌ టిక్కెట్‌ పొందిన వై.ఎస్‌ ఇప్పటికి ఆ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. అనతికాలంలోనే మంచి రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. 1983లో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక సీట్లు కైవసం చేసుకొని కేవలం పది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన విషయం తెలిసింది. అంత ప్రభంజనాన్ని సైతం తట్టుకొని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు డా. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. ఇప్పటివరకు ఓటమి ఎరుగని నేతగా, జిల్లా ప్రజల్లో చెరగని ముద్రవేశారు. పెద్ద పల్లెటూరుగా పేరుపొందిన కడప జిల్లాను తన హయాంలో ఎంతో అభివృద్ధి చేశారు. అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేసి నేడు కడప జిల్లాను ఒక పారిశ్రామిక కేంద్రంగా మలిచా

0 comments: