NTR
నందమూరి తారక రామారావు
ప్రజానేతలుగా పేరు తెచ్చుకున్నవారంతా పేదలకోసం పాటుపడినవారే కావడం విశేషం. తన సినీగ్లామర్తో పౌరాణిక పాత్రలలో జీవించేసి తానే దేవుడు అనేలా భ్రమింపజేసి సామాన్య సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆరాధ్యదేవుడయ్యారు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అనే ఆ మూడక్షరాలకు ఎంతటి పవరుందోకానీ మరొకరయితే తన పేరును ఏదోలా క్యాష్ చేసుకునేవారే. కానీ ఎన్టీఆర్ ఒక పక్క సినిమాలలో నటిస్తూనే తుపానులు, వరదలు వంటి ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు జోలెపట్టి సామాన్య ప్రజలనుంచి విరాళాలు సేకరించి, కొంత భాగం తాను కూడా సాయం అందించి తన ఉదారతను చాటుకునేవారు. తర్వాత మంచి ఆదాయం వచ్చే సినిమాలను పక్కనపెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడుతున్న ఆంధ్రనాయకులపై కళ్లెర్రజేసి సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించారు.
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ ఆశయాలు పేదవారిని, అన్నార్తులను బాగా ఆకట్టుకున్నాయి. మాస్ లీడర్గా అప్పటికే సినీసామ్రాజ్యంలో తన ముద్రను వేసిన ఎన్టీఆర్ రాజకీయ రంగం లోనూ అంతకుమించిన మాస్ లీడర్గా ఎన్నికయ్యారు. మూడుసార్లు ముఖ్య మంత్రిగా ప్రమాణం ప్రజల సమక్షంలో బాహాటంగా చేశారు. ఎల్బీ స్టేడియంలో అభిమానుల సమక్షంలో అలా ప్రమాణం చేసి తనలోని పారదర్శకతను చాటుకున్నారు. తొలి సంతకాన్ని రెండురూపాయల కిలోబియ్యం పథకం ఫైలుపై చేశారు. నాటి ఎన్నికల వాగ్దానంలో రామబాణంలా పనిచేసిన ఆ పథకం ఎందరో అన్నార్తులకు సేదతీర్చింది. గంజితాగి కడుపునింపుకునే పేదలపాలిట పరమాన్నమే అయింది. అయితే ఇంతగా అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జీర్ణించుకోలేక అప్పట్లో చాలా మంది అభిమానులు గుండెపగిలి మరణించారు. దివంగత నేత ఎన్టిఆర్ పార్థివ దేహాన్ని కూడా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఎల్బి స్టేడియంలోనే ప్రజల సందర్శనార్థం ఉంచారు అప్పట్లో. ఆయన మరణించినపుడు జనం ఒక మహాసముద్రమై స్వచ్ఛందంగా కదిలివచ్చారు.
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ ఆశయాలు పేదవారిని, అన్నార్తులను బాగా ఆకట్టుకున్నాయి. మాస్ లీడర్గా అప్పటికే సినీసామ్రాజ్యంలో తన ముద్రను వేసిన ఎన్టీఆర్ రాజకీయ రంగం లోనూ అంతకుమించిన మాస్ లీడర్గా ఎన్నికయ్యారు. మూడుసార్లు ముఖ్య మంత్రిగా ప్రమాణం ప్రజల సమక్షంలో బాహాటంగా చేశారు. ఎల్బీ స్టేడియంలో అభిమానుల సమక్షంలో అలా ప్రమాణం చేసి తనలోని పారదర్శకతను చాటుకున్నారు. తొలి సంతకాన్ని రెండురూపాయల కిలోబియ్యం పథకం ఫైలుపై చేశారు. నాటి ఎన్నికల వాగ్దానంలో రామబాణంలా పనిచేసిన ఆ పథకం ఎందరో అన్నార్తులకు సేదతీర్చింది. గంజితాగి కడుపునింపుకునే పేదలపాలిట పరమాన్నమే అయింది. అయితే ఇంతగా అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జీర్ణించుకోలేక అప్పట్లో చాలా మంది అభిమానులు గుండెపగిలి మరణించారు. దివంగత నేత ఎన్టిఆర్ పార్థివ దేహాన్ని కూడా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఎల్బి స్టేడియంలోనే ప్రజల సందర్శనార్థం ఉంచారు అప్పట్లో. ఆయన మరణించినపుడు జనం ఒక మహాసముద్రమై స్వచ్ఛందంగా కదిలివచ్చారు.

0 comments:
Post a Comment